కేసీఆర్ సారూ! ఇదేమన్నా బాబర్ కాలమా?. బెడ్ పై టీఆర్ఎస్ లీడర్ ఆవేదన

కేసీఆర్ సారూ! ఇదేమన్నా బాబర్ కాలమా?. బెడ్ పై టీఆర్ఎస్ లీడర్ ఆవేదన

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు ఓ టీఆర్ఎస్ కార్యకర్త. కరోనాతో పోరాడుతూ హాస్పిటల్ బెడ్ పై ఉన్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలానికి చెందిన కార్యకర్త. తమ మండలాన్ని దత్తత తీసుకుంటానన్న బాల్క సుమన్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ప్రతీ కాలనీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. మండలం మొత్తం వెంటనే టెస్టులు చేయాలన్నారు. టెస్టులు ఆలస్యం కావడంతో పాటు.. బెడ్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇదేమైనా  అక్బర్,బాబర్ కాలమా? అని ప్రశ్నించారు.  సర్కార్ మూర్ఖత్వం వీడి టెస్టులు పెంచాలన్నారు. టెస్టులు పెంచకనే కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని అందరూ తిట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెస్టులు చెయ్యకపోతే.. చావులు తప్పవంటూ ఆవేదన వ్యక్తం చేశారు.