పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డవారిపై టీఆర్ఎస్ వేటు వేసింది. ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఐదుగురు టీఆర్ఎస్ నేతలను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
బహిష్కరణకు గురైన ఐదుగురు టీఆర్ఎస్ నేతలు
- మడత వెంకటేశ్( మాజీ కో ఆప్షన్ మెంబర్, ఇల్లందు మున్సిపాలిటీ)
- మడత రమ( మాజీ మున్సిపల్ ఛైర్మన్)
- కొరం సురేందర్( మాజీ సర్పంచ్)
- బాణోత్ భద్రు(మాజీ సర్పంచ్ బేతంపూడి)
- తాటి భిక్షమయ్య( ఎఎమ్ సీ మాజీ వైస్ ఛైర్మన్)
see more news
లోకేష్.. చికెన్ షాప్ ముందు తొడకొట్టినట్టుంది..కోసి కూరొండుతరు జాగ్రత్త