టీఆర్ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నరు: తరుణ్ చుగ్

టీఆర్ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నరు: తరుణ్ చుగ్
  • బీజేపీకి ఆదరణ పెరుగుతుంటే ఓర్వలేక దాడులు: తరుణ్ చుగ్

హైదరాబాద్: తమ పార్టీ ఎంపీ అర్వింద్ నివాసంపై దాడిని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో బీజేపీకి మద్దతు పెరుగుతోందని ఓర్వలేక TRS నాయకులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అర్వింద్ ఇంటిపై దాడిలో టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు సూత్రధారులుగా ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు.

టీఆర్ఎస్ పార్టీ నేతలు కిరాయి గూండాల్లా వ్యవరిస్తున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు. పోలీసుల తప్పిదం క్లియర్ గా కనిపిస్తుందన్నారు. పోలీసులు టీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా వ్యవరిస్తున్నారన్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో కూడా  ఈటల రాజేందర్ పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై టీఆర్ఎస్  దాడులను ప్రజలు గమనిస్తున్నారని,  కేసీఆర్ ప్రజల్లో చులకనవుతున్నారని తరుణ్ చుగ్ అన్నారు.