కేఏ పాల్పై టీఆర్ఎస్ శ్రేణుల దాడి..!

కేఏ పాల్పై టీఆర్ఎస్ శ్రేణుల దాడి..!

ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ వస్తున్నారని తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు సిరిసిల్ల సమీపంలో అడ్డుకున్నారు. పోలీసుల ఎదుటే ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన కేఏ పాల్ పోలీసులపై ఫైర్ అయ్యారు. మీరు ప్రభుత్వోద్యోగులా లేక టీఆర్ఎస్ కార్యకర్తలా అని నిలదీశారు. కేటీఆర్ జీతాలు ఇస్తున్నాడా.. ప్రజల సొమ్ము నుంచి జీతాలు వస్తున్నాయా అని ప్రశ్నించారు.