డబ్బులు పంచుతూ.. కెమెరాకు చిక్కిన నేతలు
సిద్దిపేట, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ నేత డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. తొగుటలో మంగళవారం టీఆర్ఎస్ యువ గర్జన బైక్ ర్యాలీని నిర్వహించింది. ర్యాలీలో పాల్గొన్నోళ్లకు మునిపల్లి టీఆర్ఎస్ జడ్పీటీసీ భర్త సాయి రూ.500 చొప్పున పంచి పెట్టారు. ర్యాలీ తర్వాత యువకులకు బహిరంగంగానే ఆయన డబ్బులిచ్చారు.