మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార టీఆర్ఎస్ మాత్రం విశ్వప్రయాత్నాలు చేస్తోంది. ఈ ఉపఎన్నికను చాలా సీరియస్ గా తీసుకున్న గులాబీ పార్టీ ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం మొదలుపెట్టింది. నిన్నటి దాకా గోడ గడియారాలు, గొడుగులను పంచిన ఆ పార్టీ లీడర్లు.. ఇప్పుడు వినాయక చవితి పండగను క్యాష్ చేసుకుంటున్నారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని అన్ని యూత్ సంఘాలకు రూ. 10 వేల నుండి 20 వేల వరకు చందాలు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పార్టీని, పార్టీ గుర్తును విస్తృతంగా ఓటర్లకు చేర్చాలని టీఆర్ఎస్ లీడర్లు ప్రయాత్నాలు చేస్తున్నారు.