పోలీసుల అండతో రౌడీయిజం చేస్తున్నారు

పోలీసుల అండతో రౌడీయిజం చేస్తున్నారు
  • నిజామాబాద్ ఎంపీ అరవింద్

నిజామాబాద్: పోలీసుల అండతో టీఆర్ఎస్ నేతలు రౌడీయిజం చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను హాస్పిటల్ లో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి బలపడుతుందన్నఈర్షతో టీఆరెస్ నేతలు దాడులకు దిగుతున్నారని విమర్శించారు. బిజెపి ముందు టీఆరెస్ పార్టీ దేనిముందు నిలువదు..నిజమాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు రౌడీలను పెంచిపోషిస్తున్నారు..రౌడీయిజం చేసి బిజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమ్..’’ అని ఎంపీ అరవింద్ హెచ్చరించారు. పోలీసులు సైతం టీఆర్ఎస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారు.. పోలీసు కమిషనర్ కార్తికేయకు ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదు.. కార్తికేయ టీఆర్ఎస్ కార్యకర్తలా పనిచేస్తున్నారు..బిజెపి కార్యకర్తలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాంద్ చేస్తున్నాం.. మేము అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబ సభ్యుల, టీఆరెస్ నేతలపై ఉన్న కేసులు బయటకి తీస్తాం..ఒక పక్క కేసీఆర్ కుటుంబం భైంసా లాంటి ఘటనలను ప్రోత్సహిస్తూ, మరోపక్క పూజలు అంటూ గుళ్ళు గోపురాలు తిరగటం  విడ్డురంగా ఉంది..’’ అరవింద్ పేర్కొన్నారు. హిందూ వ్యతిరేకి ఆయిన కేసీఆర్ కుటుంబాన్ని హిందూ సమాజం నుండి వెలివేయాలని ఆయన కోరారు.