కొనసాగుతున్న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం

కొనసాగుతున్న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం

తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గంతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ మీటింగ్ కు ఫాం హౌస్ ట్రాప్డ్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి వెంట తీసుకువచ్చారు. సీఎం కాన్వాయ్ లోని ఓ కారులో వారు నలుగురు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. 

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం, పార్టీ ప్రచారం, వచ్చిన ఓట్లపై విశ్లేషించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచి సంసిద్ధం కావడంపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసే అవకాశముంది. క్యాడర్ బలోపేతంతో పాటు ప్రజా ప్రతినిధులు ఇప్పటి నుంచి ప్రజలతో మమేకంకావడంపై కేసీఆర్ పార్టీ నాయకులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మీటింగ్ అనంతరం నియోజకవర్గ ఇంఛార్జులను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

ఫాం హౌస్ కేసుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వవచ్చని సమాచారం. ఈ అంశంపై పార్టీ నేతల్లో నెలకొన్న అనుమానాలను ఆయన నివృత్తి చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా గుర్తిస్తూ ఎలక్షన్ కమిషన్ ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ క్రమంలో ఈసీ ప్రకటన అనంతరం బీఆర్ఎస్ గురించి దేశవ్యాప్తంగా తెలిసేలా భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. మీటింగ్ ఎక్కడ ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై కూడా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించే ఛాన్సుంది.