పోలీసుల అదుపులో ఫాంహౌజ్ కేసు నిందితులు

పోలీసుల అదుపులో ఫాంహౌజ్ కేసు నిందితులు

ఫాంహౌజ్ కేసులో నిందితులను హైకోర్టు రిమాండ్ కు అంగీకరించింది. కోర్టు రిమాండ్ కు అంగీకరించడంతో నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్ పేట్ లోని వారి నివాసం నుంచి తరలించారు. ఇంటి వెనుక గేట్ నుంచి నిందితులను తరలించారు. మీడియా కంట పడకుండా నందకుమార్ తో పాటు మిగతా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ కేసులో మొదట ఏసీబీ ప్రొసీజర్ ఫాలో అవలేదని చెప్పి..రిమాండ్ తిరస్కరించగా.. ఏజీ వెంటనే రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నిందితుల అరెస్ట్ కు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. రెండు రోజల క్రితం నాంపల్లి ఏసీబీ కోర్టు మేజిస్ట్రేట్ నిందితులకు రిమాండ్ నిరాకరిస్తూ ఇచ్చిన ఆర్డర్ ను హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం చేసిన అప్పీల్ ను పరిగణలోకి తీసుకున్నది. కాగా, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సైబరాబాద్ కమిషనరేట్ కు తరలించారు. అక్కడి నుంచి మొయినాబాద్ పీఎస్ కు తీసుకెళ్లారు. అక్కడ మరోసారి నిందితుల వాంగ్మూలం పోలీసులు రికార్డ్ చేయనున్నారు. అనంతరం నాంపల్లి ఏసీబీ జడ్జి ముందు నిందితులను ప్రవేశ పెట్టనున్నారు.