టీఆర్ఎస్ తో పొత్తుపై త్వరలో నిర్ణయం : చాడ

టీఆర్ఎస్ తో పొత్తుపై త్వరలో నిర్ణయం :  చాడ

హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో మద్దతివ్వాలని సీపీఐను కోరారు టీఆర్ఎస్ నేతలు. ముగ్థుం భవన్ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో భేటీ అయ్యారు కేకే, నామా నాగేశ్వరరావు, వినోద్. ఉప ఎన్నికల్లో కలిసి పనిచేయడంపై నేతలు మాట్లాడుకున్నారు. తమకు సపోర్ట్ చేయాలని సీపీఐను రిక్వెస్ట్ చేశారు గులాబీ నేతలు. దీనిపై సీపీఐ కూడా సానుకూలంగా స్పందించింది. ఒకటో తారీఖు కార్యవర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు చాడ.