కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం

కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతోంది. సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎమ్మెల్యే కోటాలో  ఎమ్మెల్సీకి  నామినేషన్ వేసిన అభ్యర్థులు కూడా సమావేశానికి హాజరయ్యారు. నామినేషన్ వేసిన mlc అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు సీఎం కేసీఆర్.

వరి దాన్యం కొనుగోలు విషయంలో... రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ లో చేపట్టాల్సిన కార్యచరణపై సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. ఈనెల 29న తెలంగాణ దీక్షా దివస్ సందర్భంగా ఢిల్లీలో ధాన్యం కొనుగోళ్లపై నిరసనలకు ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్. దీనిపైన కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావాన్ని బట్టి యాసంగిలో ఇతర పంటల సాగును ప్రోత్సహించే అంశంపై ఎమ్మెల్యేలతో KCR చర్చించనున్నారు. MLCలకు నామినేషన్ వేసిన అభ్యర్ధులు కూడా మీటింగ్ కు హాజరయ్యారు.