
అమేథీ: ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొట్టడంతో ఐదుగురు చనిపోయారు. హర్యానా నుంచి బిహార్కు అంబులెన్స్లో మృతదేహాన్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు.
మృతులను బిహార్లోని సమస్తిపూర్ జిల్లా నివాసితులు రాజ్ కుమార్ శర్మ, రవి శర్మ, ఫూలో శర్మ, డ్రైవర్లయిన సర్ఫరాజ్, అబిద్లను హర్యానా నివాసితులుగా గుర్తించామని చెప్పారు. సమస్తి పూర్కు చెందిన అశోక్ శర్మ మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం హర్యానా నుంచి బిహార్కు తరలిస్తుండగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. అంబులెన్స్లో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారని వివరించారు.