యూపీలో ట్రక్కు, అంబులెన్స్ ఢీ.. ఐదుగురు మృతి

 యూపీలో ట్రక్కు, అంబులెన్స్ ఢీ.. ఐదుగురు మృతి

అమేథీ: ఉత్తరప్రదేశ్‏లోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొట్టడంతో ఐదుగురు చనిపోయారు. హర్యానా నుంచి బిహార్‎కు అంబులెన్స్‎లో మృతదేహాన్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్‎లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్‎కు చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. 

మృతులను బిహార్‎లోని సమస్తిపూర్ జిల్లా నివాసితులు రాజ్ కుమార్ శర్మ, రవి శర్మ, ఫూలో శర్మ, డ్రైవర్లయిన సర్ఫరాజ్, అబిద్‎లను హర్యానా నివాసితులుగా గుర్తించామని చెప్పారు. సమస్తి పూర్‌‎కు చెందిన అశోక్ శర్మ మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం హర్యానా నుంచి బిహార్‎కు తరలిస్తుండగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. అంబులెన్స్‎లో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారని వివరించారు.