లారీ-ట్రాక్టర్ ఢీ : ఆరుగురు మృతి

లారీ-ట్రాక్టర్ ఢీ : ఆరుగురు మృతి

యూపీ హర్దోయిలో ఘోర ప్రమాదం జరిగింది. సర్దార్ పూర్ సమీపంలో లారీ, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఆరుగురు చనిపోయారు. 30 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం గురించి తెలియగానే స్పాట్ కు చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.