బస్సును ఢీ కొట్టిన ట్రక్కు..11 మంది మృతి

బస్సును ఢీ కొట్టిన ట్రక్కు..11 మంది మృతి

రాజస్థాన్ లోని భారత్ పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హంత్ర సమీపంలోని జైపూర్-ఆగ్రా హైవేపై  అతి వేగంతో వస్తున్న  ఓ ట్రక్కు రోడ్డుపక్కన ఆగి ఉన్న బస్సు ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11మంది మృతిచెందగా.. మరో 12మందికి గాయాలయ్యాయి.  సెప్టెంబర్ 13న తెల్లవారు జామున  గుజరాత్ భావ్ నగర్ నుంచి యూపీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు భరత్ పూర్ ఎస్పీ తెలిపారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.. 

 రాజస్థాన్లోని పుష్కర్ నుంచి యూపీ మధురకు వెళ్లున్న బస్సు.. లఖన్ పూర్ కు దగ్గరకు రాగానే బ్రేక్ డౌన్ అయ్యింది.  దీంతో రోడ్డు పక్కన డ్రైవర్ తో పాటు కొంత మంది నిలబడ్డారు. అదే సమయంలో  వెనకనుంచి వచ్చిన ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. స్పాట్ లోనే  చనిపోయారు.   మృతి చెందిన వారిలో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు.