
సాంకేతిక లోపంతో నిలిచిన విమానం
న్యూఢిల్లీ: ఎట్టకేలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ నుంచి తమ దేశానికి వెళ్లిపోయారు. జీ20 సమిట్లో పాల్గొనేందుకు ట్రూడోతో పాటు ఆ దేశ ప్రతినిధులు శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం తిరిగి బయలుదేరాల్సి ఉండగా.. విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. దీంతో వారు ఇక్కడే చిక్కుకుపోయారు. సమస్య మంగళవారం పరిష్కారం కావడంతో మధ్యాహ్నం 1:10 గంటలకు ట్రూడో, ఆయన బృందం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు.
భారత ఎంబసీని మూసేయాలె..
కెనడాలోని ఒట్టావాలో ఉన్న భారత ఎంబసీని మూసేయాలని, హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను వెనక్కి పిలవాలని ఖలిస్తానీ గ్రూప్ మంగళవారం బెదిరింపు కాల్ చేసింది. కెనడా ప్రధాని మన దేశంలో ఉన్న టైంలోనే ఈ కాల్ వచ్చింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. 48 గంటల్లో ఇలాంటి కాల్ రావడం ఇది రెండో సారి.
మోదీ, అమిత్షా, జైశంకర్లకు బెదిరింపులుసిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్లపై బెదిరింపులకు పాల్పడ్డాడు. “హర్దీప్ సింగ్ నిజ్జర్ను హత్య చేసిన వారికి ఇది సందేశం. మీ చావు కోసం మేము పిలుపునిస్తున్నాం.. మోదీ, జైశంకర్, దోవల్, అమిత్ షా.. మేము మీ కోసం వస్తున్నాం” అంటూ పన్నూన్ బెదిరించారు.