భారత్‌లో ట్రంప్ షెడ్యూల్: ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే…

భారత్‌లో ట్రంప్ షెడ్యూల్: ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు అధికారిక షెడ్యూల్ వచ్చింది. సోమవారం పొద్దున 11 గంటల 55 నిమిషాలకు అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు ట్రంప్. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, అధికారులు ఆయనకు స్వాగతం చెప్పనున్నారు. ఎయిర్ పోర్ట్  నుంచి మోతెరా స్టేడియం వరకు భారీ ర్యాలీ తీయనున్నారు ట్రంప్, మోడీ. మధ్యాహ్నం పన్నెండునరకు మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం జరగనుంది. తర్వాత  మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఆగ్రా వెళ్లనున్న అమెరికా అధ్యక్షుడు.  సాయంత్రం ఐదు గంటల 10 నిమిషాలకు  తాజ్ మహల్ ను సందర్శించనున్నారు ట్రంప్ దంపతులు. రేపు రాత్రి ఏడున్నరకు పాలెం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు ట్రంప్. రాత్రికి మౌర్య హోటల్ లో బస చేయనున్నారు.

ఇక మంగళవారం ఉదయం 9 గంటల 55 నిమిషాలకు రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు ట్రంప్. ఉదయం 10.45కి రాజ్ ఘాట్ లో గాంధీకి నివాళులు అర్పించనున్నారు. మంగళవారం ఉదయం  11 గంటల 25 నిమిషాలకు హైదరాబాద్  హౌస్ లో మోడీ-ట్రంప్  జాయింట్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ద్వైపాక్షిక చర్చల తర్వాత ట్రంప్ , ప్రధాని మోడీ కలిసి లంచ్ చేయనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు అమెరికా ఎంబసీ సిబ్బందితో భేటీ కానున్నారు డొనాల్డ్ ట్రంప్. మంగళవారం రాత్రి 8గంటలకు రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్  డిన్నర్  ఇవ్వనున్నారు. తర్వాత ఎల్లుండి రాత్రి 10గంటలకు అమెరికాకు బయల్దేరనున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.