సినారెకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్

సినారెకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
  • సాహితీ సేవకు గుర్తుగా హైదరాబాద్ లో ‘‘సినారె సారస్వత సదనం’’ నిర్మాణం:కేసీఆర్

హైదరాబాద్: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డా.సినారె ( సింగిరెడ్డి నారాయణ రెడ్డి) జయంతి సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. కవిగా, సినీ గీతాల రచయితగా, పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.గజల్ వంటి ఉర్దూ సాహితీ సాంప్రదాయానికి గౌరవమిచ్చి, తెలంగాణ సాహిత్యాన్ని గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలిపారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 
రాజ్యసభ సభ్యునిగా, వివిధ యూనివర్శిటీలకు వైస్ చాన్సలర్ గా, ఆయన చేసిన సేవలు అత్యంత విలువైనవన్నారు. అలాగే కరీంనగర్ బిడ్డగా తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన డా.సినారె, తెలంగాణ  భాష, సాహిత్య రంగానికి చేసిన సేవ చిరస్మరణీయమని సీఎం కేసీఆర్ తెలిపారు. డా. సి.నారాయణ రెడ్డి సాహితీ సేవకు గుర్తుగా హైదరాబాద్ లో "సినారె సారస్వత సదనం" నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని కేసీఆర్ వెల్లడించారు.