- సభను తప్పుదోవ పట్టించి మమ్మల్ని సస్పెండ్ చేసిన్రు: ఎమ్మెల్యే తలసాని
హైదరాబాద్, వెలుగు: పవిత్రమైన అసెంబ్లీని కాంగ్రెస్ప్రభుత్వం పార్టీ ఆఫీస్గాంధీ భవన్లా మార్చిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజన్నారు. ఇల్లీగల్ మైనింగ్పై హౌస్కమిటీ వేయాలని డిమాండ్చేస్తే అటెన్షన్డైవర్షన్లో భాగంగా సీఎం రేవంత్రెడ్డి చర్చను కులాలపైకి తీసుకెళ్లారన్నారు.
తన వెంట్రుక కూడా పీకలేరన్నట్టు కడియం శ్రీహరి సైగ చేశారని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సభను తప్పుదోవ పట్టించి తమను సస్పెండ్ చేశారన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై బీఆర్ఎస్అభ్యంతరం తెలుపుతుందనే ఇలా చేశారని మండిపడ్డారు. ఎథిక్స్ కమిటీ లేనే లేదని, అలాంటప్పుడు ఎథిక్స్ కమిటీకి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎలా రిఫర్ చేస్తారో చెప్పాలన్నారు.
