పదో తరగతి పరీక్షా సమయంలో మార్పు

పదో తరగతి పరీక్షా సమయంలో మార్పు

పదో తరగతి పరీక్షా సమయంలో ప్రభుత్వం మార్పు చేసింది. పరీక్షా నిర్వహించే సమయాన్ని మరో అర్థగంట పెంచుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై టెన్త్ క్లాస్ ఎగ్జామ్ 3.15గంటల పాటు కొనసాగనుంది. గతంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష నిర్వహించేవారు. తాజాగా సవరించిన టైమింగ్స్ ప్రకారం.. ఈ ఏడాది నుంచి ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రశ్నాపత్రంలో ఎక్కువ ఛాయిస్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు పరీక్షా సమయాన్ని మరో అర్థగంట పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

వినూత్న నిరసన.. 50 గంటల్లో 350 కి.మీ.ల పరుగు..

ఢిల్లీ సిటీ బస్సులో చెలరేగిన మంటలు