ఎమ్మెల్యే  ఫండ్స్‌ రూ.5 కోట్లకు పెంపు

ఎమ్మెల్యే  ఫండ్స్‌ రూ.5 కోట్లకు పెంపు

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి ఫండ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావు​శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఫైనాన్షియల్‌ ఇయర్‌‌ బడ్జెట్‌లోనే సీడీపీ ఫండ్స్‌ పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. అందుకు అనుగుణంగా జీవో ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15లో ఒక్కో నియోజకవర్గానికి రూ.1.50 కోట్లు ఇచ్చారు. 2016-17లో రూ.3 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లకు పెంచారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సీడీపీ కింద పనులను ప్రతిపాదిం చగా, వాటికి జిల్లా కలెక్టర్​ పరిపాలన అనుమతులు ఇస్తారు.