‘ఆ నిర్ణ‌యాన్ని మీకే వ‌దిలేస్తున్నాం..’ గర్భిణీ మృతి కేసులో హైకోర్టు

‘ఆ నిర్ణ‌యాన్ని మీకే వ‌దిలేస్తున్నాం..’ గర్భిణీ మృతి కేసులో హైకోర్టు

హైద‌రాబాద్ : గద్వాలకు చెందిన గర్భిణి, పసికందు మృతి ఘటనపై హైకోర్టు విచారణ జరిపింది. అత్యవసర సేవల కోసం హైవేలపై 86 అంబులెన్సులు ఏర్పాటు చేశామని, గర్భిణీలకు వైద్య సేవలు అందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఘటనపై బాధ్యులైన వైద్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలా వద్దా అనే నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విషయంలో న్యాయవాదులు కిషోర్ కుమార్, శ్రీనిత లేఖలపై హైకోర్టు విచారణ ముగించింది.

TS high court completes probe on gadwal pregnant woman death