రేపే(ఏప్రిల్ 12) ఇంటర్మీడియెట్ఫలితాలు

రేపే(ఏప్రిల్ 12) ఇంటర్మీడియెట్ఫలితాలు
  •     క్యాంప్ ఆఫీస్​లో రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ పరీ క్షల ఫలితాలు ఆదివారం రిలీజ్ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన క్యాంప్​ఆఫీస్​లో రిజల్ట్స్​విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25 నుంచి మార్చి18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఫస్టియర్ విద్యార్థులు 4,89,126 మంది, సెకండియర్ విద్యార్థులు 5,07,949 మంది హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ tgbie.cgg.gov.in లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.