ఏప్రిల్ 21న టీఎస్ ఆర్జేసీ ఎంట్రెన్స్ టెస్టు

ఏప్రిల్ 21న టీఎస్ ఆర్జేసీ ఎంట్రెన్స్ టెస్టు

హైదరాబాద్, వెలుగు: గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్ల కోసం ఈ నెల21న టీఎస్​ఆర్జేసీ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు గురుకులాల సెక్రటరీ రమణకుమార్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష ఉంటుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 33 జిల్లాల నుంచి 73,527 మంది స్టూడెంట్లు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులు  https://tsrjdc.cgg.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.