
- జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు వరం
- ఓయూ జేఏసీ, ఎన్ఎస్యూఐ నాయకులు
ఓయూ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జ్యాబ్క్యాలెండర్విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓయూలో టీఎస్జేఏసీ, కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి ఫొటోకు వేర్వేరుగా క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్అధికార ప్రతినిధులు చనగాని దయాకర్, కోటూరి మానవతారాయ్మాట్లాడుతూ.. నిరుద్యోగులకు జాబ్క్యాలెండర్ఒక వరమన్నారు. ప్రభుత్వ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయని తెలిపారు. పదేండ్ల కాలంలో ఒక్క జాబ్క్యాలెండర్రిలీజ్చేయడం చేతకాని బీఆర్ఎస్నేతలు విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు.
సీఎం అమెరికా టూర్ముగిశాక ఓయూలో సభ నిర్వహిస్తామని చెప్పారు. కేటీఆర్కు ఓయూకు వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. కేటీఆర్ కు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఓయూ జేఏసీ, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు మేడ శ్రీను, వినయ్, జంపాల రాజేశ్, సంపత్, భూషణ్, వలిగొండ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.