హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదించలేదని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. సోమ, మంగళవారాల్లో గవర్నర్ రాష్ట్రంలో లేరు. హైదరాబాద్కు వచ్చిన తరువాత టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ భావిస్తున్నారు.
అందులో భాగంగా సీఎస్కు లేఖ రాసే అవకాశం ఉందని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పేపర్ లీకుపై కోర్టులో కేసు ఉండటంతో రాజీనామాను ఆమోదించాలా లేక గతంలో ప్రతిపాదించినట్లుగా ప్రెసిడెంట్ నుంచే బోర్డును పుర్తిగా రద్దు చేసేలా ముందుకువెళ్లడమా అనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.