నిరుద్యోగుల బతుకులను కేసీఆరే ఆగం చేస్తుండు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నిరుద్యోగుల బతుకులను కేసీఆరే ఆగం చేస్తుండు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

2009 తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేస్తే.. రాష్ట్రం వచ్చాక మళ్లీ ఇప్పుడు TSPSC బోర్డు ముందు విద్యార్థులు ఉద్యోగాల కోసం ధర్నాలు చేయాల్సి వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిరుద్యోగులు పడుతున్న కష్టాలకు కారణం కేసీఆర్ అని విమర్శించారు. ప్రభుత్వానికి పరోక్షంగా కంట్రోల్ లేకపోతే .. సంతోష్ అనే కంట్రోలర్ ను ఎలా నియమించారని ప్రశ్నించారు. 

TSPSCకి పర్మినెంట్ ఉద్యోగులు, అవుట్ సోర్స్ ఉద్యోగులను డిసైడ్ చేసిది ప్రభుత్వమేనని తెలిపారు. హైదరాబాద్ లో అనేక లైబ్రరీలో కూర్చుని సంవత్సరాలుగా చదువుకున్న నిరుద్యోగుల బతుకులు ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. TSPSC అనేది ఆర్టికల్ 317 ద్వారా ఏర్పడ్డ రాజ్యాంగ సంస్థ అయినా ప్రభుత్వం ద్వారా పరోక్షంగా నడుపబడుతోందని అందరికీ తెలుసని సూచించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, ఇతర ఉద్యోగులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే ఉద్యోగం నుంచి తొలగిపోవాలని డిమాండ్ చేశారు. 

Also Read :- తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడి.. రైతు పథకాల పేరుతో అక్రమ సంపాదన

టీఎస్పీఎస్సీ పేపర్లు ఇలాగే అమ్ముడు పోతుంటే.. ఇక ఏ విద్యార్థి కూడా ప్రిపేర్ అవ్వలేరని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. టీఎస్పీఎస్సీ బోర్డు పూర్తి రద్దు అయ్యే వరకు ఏ విద్యార్థి పరీక్షలు రాయకూడదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.