మే 6న టీఎస్ ఆర్జేసీ సెట్ పరీక్ష

మే 6న టీఎస్ ఆర్జేసీ సెట్ పరీక్ష

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడిచే 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్–2023 పరీక్షను ఈనెల 6న నిర్వహించనున్నామని సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణ కుమార్ తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. ఈ పరీక్షకు మొత్తం 59,340 మంది అప్లై చేశారని వెల్లడించారు. విద్యార్థులు వెబ్ సైట్​ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.