సికింద్రాబాద్, వెలుగు: సనత్నగర్లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలకు వచ్చే భక్తుల కోసం సిటీ నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు ప్రకటించారు. జేబీఎస్లోని ఈడీ ఆఫీసులో సోమవారం ఆయన ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈనెల 20న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
19, 20 తేదీల్లో సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి స్పెషల్బస్సు సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు. భక్తులు ప్రైవేటు వెహికల్స్ను ఆశ్రయించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్వెంకన్న, డిప్యూటీ ఆర్ఎం అపర్ణ కళ్యాణి పాల్గొన్నారు.