
మేడిపల్లి/ మేడ్చల్, వెలుగు: యాత్రికుల కోసం సిటీలోని పలు డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఈ నెల 27 నుంచి ఉప్పల్ చౌరస్తా మీదుగా ముచ్చింతల్లోని అనంతపద్మనాభ స్వామి, షాద్నగర్లోని రామలింగేశ్వర స్వామి, అమ్మపల్లిలోని సీతారామస్వామి, వెండికొండలోని వెండికొండ సిద్దేశ్వర స్వామి దేవాలయాల దర్శనం కోసం ప్రత్యేక టూర్ బస్సులు నడుపుతున్నట్లు చెంగిచెర్ల డిపో మేనేజర్ కవిత తెలిపారు. 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉంటే వారి కాలనీ నుంచే దర్శనాలకు తీసుకెళ్తామన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ. 600, పిల్లలకు రూ. 300 ఉంటుందన్నారు.
మేడ్చల్ డిపో నుంచి కూడా..
మేడ్చల్ బస్సు డిపో నుంచి కూడా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ సుధాకర్ తెలిపారు. ఈ నెల 27 నుంచ ఉదయం 7 గంటలకు మేడ్చల్ బస్సు డిపో నుంచి కాళేశ్వరం, రామప్ప, భద్రకాళి, వేయి స్తంభాల గుడికి టూర్ ఉంటుందన్నారు. ఆయా ఆలయాల్లో దర్శన అనంతరం మేడ్చల్ బస్సు డిపోకు తిరిగి రాత్రి 10 గంటలకు బస్సు చేరుకుంటుందని పేర్కొన్నారు. టికెట్ ధరలు పెద్దలకు రూ. 1200 , పిల్లలకు రూ. 600 ఉంటుందన్నారు. వీకెండ్లో ఈ సర్వీసులు ఉంటాయని స్పష్టం చేశారు. వివరాలకు 9849737131 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.