
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం
ఖైరతాబాద్,వెలుగు : తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల11 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కంచర కుంట్ల వంశీరెడ్డి తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికాలో స్థిరపడిన వారంతా మాతృభూమిలోని పేదలకు తమ వంతు సాయం చేసేందుకు వేదికగా సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం నుంచి తెలంగాణలోని15 జిల్లాలు సందర్శించి ‘టీటీఏ సేవా డేస్’పేరుతో అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
12న టీ హబ్లో టెక్నాలజీపై,16న ఆరోగ్యంపై అవగాహనకు నెక్లెస్ రోడ్డులో 5కే రన్ నిర్వహిస్తున్నామన్నారు.18న వరంగల్లో మెగా జాబ్మేళాతోపాటు వీల్చైర్స్పంపిణీ,హెల్త్క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 17న వికారాబాద్ లో కృత్రిమ అవయవాల పంపిణీ, 23న రవీంద్రభారతిలో సేవాడేస్ ముగింపు సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కో– ఆర్డినేటర్ దుర్గాప్రసాద్ సెలోజ్, కమ్యూనిటీ సర్వీసు చైర్మన్పెరుక నర్సింహ, జ్యోతిరెడ్డి దుడిపల, సంగీత రెడ్డి, ప్రదీప్,శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.