అలిపిరి మార్గంలో షెడ్లు, లడ్డూ ప్రసాదాల నెయ్యి ప్లాంట్ ఏర్పాటు : టీటీడీ పాలక మండలి

అలిపిరి మార్గంలో షెడ్లు, లడ్డూ ప్రసాదాల నెయ్యి ప్లాంట్ ఏర్పాటు : టీటీడీ పాలక మండలి

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన  తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

టీటీడీ పాలక మండలి నిర్ణయాలు:

  • 4 కోట్ల రూపాయలతో అలిపిరి నడకమార్గంలో నరశింహ స్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు భక్తులు సౌకర్యర్దం షెడ్లు ఏర్పాటు 
  • 24 కోట్ల రూపాయల వ్యయంతో   ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు 
  • 4.5 కోట్ల రూపాయలతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునీకరణ
  • 23.5 కోట్ల రూపాయలతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణం
  • శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణంకు రూ. 3 కోట్లు కేటాయింపు
  •  మంగాపురం ఆలయాన్ని అభివృద్ది్ చేయడాడనికి రూ. 3.1 కోట్లు కేటాయింపు
  •  వకుళామాత ఆలయం అభివృద్దికి  రూ. 9.85 కోట్లు కేటాయింపు
  • 2.6 కోట్ల రూపాయిలతో   తిరుమలలో అవుటర్ రింగ్ రోడ్డులో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు
  • శ్రీనివాస సేతు ప్రాజేక్ట్ కి పనులు ప్రాతిపాదికన రూ.118 కోట్లు కేటాయింపు
  • యస్వీ ఆయిర్వేద కళాశాల అభివృద్దికి రూ.  11.5 కోట్లు కేటాయింపు
  • రుయాలో టిబి వార్డు ఏర్పాటుకు రూ. 2.2 కోట్లు కేటాయింపు
  • రూ. 11 కోట్లతో యస్వీ సంగీత కళశాల అభివృద్ది
  • తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం,పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ది పనులుకు రూ. 1.25 కోట్లు 
  • గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ని టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడు సంవత్సరాలు పొడిగింపు
  • టీటీడీ ఆస్థులు పరిరక్షణలో భాగంగా 69 స్థలాలుకు కంచె ఏర్పాటుకు 1.25 కోట్లు కేటాయింపు
  • నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు రూ. 5 కోట్లు  కేటాయింపు