తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
టీటీడీ పాలక మండలి నిర్ణయాలు:
- 4 కోట్ల రూపాయలతో అలిపిరి నడకమార్గంలో నరశింహ స్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు భక్తులు సౌకర్యర్దం షెడ్లు ఏర్పాటు
- 24 కోట్ల రూపాయల వ్యయంతో ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు
- 4.5 కోట్ల రూపాయలతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునీకరణ
- 23.5 కోట్ల రూపాయలతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణం
- శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణంకు రూ. 3 కోట్లు కేటాయింపు
- మంగాపురం ఆలయాన్ని అభివృద్ది్ చేయడాడనికి రూ. 3.1 కోట్లు కేటాయింపు
- వకుళామాత ఆలయం అభివృద్దికి రూ. 9.85 కోట్లు కేటాయింపు
- 2.6 కోట్ల రూపాయిలతో తిరుమలలో అవుటర్ రింగ్ రోడ్డులో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు
- శ్రీనివాస సేతు ప్రాజేక్ట్ కి పనులు ప్రాతిపాదికన రూ.118 కోట్లు కేటాయింపు
- యస్వీ ఆయిర్వేద కళాశాల అభివృద్దికి రూ. 11.5 కోట్లు కేటాయింపు
- రుయాలో టిబి వార్డు ఏర్పాటుకు రూ. 2.2 కోట్లు కేటాయింపు
- రూ. 11 కోట్లతో యస్వీ సంగీత కళశాల అభివృద్ది
- తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం,పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ది పనులుకు రూ. 1.25 కోట్లు
- గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ని టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడు సంవత్సరాలు పొడిగింపు
- టీటీడీ ఆస్థులు పరిరక్షణలో భాగంగా 69 స్థలాలుకు కంచె ఏర్పాటుకు 1.25 కోట్లు కేటాయింపు
- నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు రూ. 5 కోట్లు కేటాయింపు