తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

 తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. స్వామివారికి ఉదయం 8గంటల నుంచి ఐనా మహల్ దగ్గర స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత చక్రస్నానం ఉంటుంది. రాత్రి 7గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8నుంచి 9గంటల వరకు నిర్వహించే ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.