ఫ్యామిలీ గొడవ : TTD ఉద్యోగి ఆత్మహత్య

ఫ్యామిలీ గొడవ : TTD ఉద్యోగి ఆత్మహత్య

తిరుపతిలో TTD ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతిలోని TTD పరిపాలనా భవనంలోని JEO కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న సంపత్ ..కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. వినాయక నగర్ క్వార్టర్స్ లోని తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఫ్యామిలీ తగాదాల కారణంగా సంపత్ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. 9సంవత్సరాలకు ముందు మహేశ్వరి అనే యువతితో సంపత్ కు వివాహమైంది.

వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్యా, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో శుక్రవారం తెల్లవారుజామున గొడవ కాస్త పెద్దదైందని తెలిపారు బంధువులు. దీంతో ఆవేదనకు లోనైన సంపత్ ..తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తిరుపతి రుయా హస్పిటల్ కి తరలించారు.