శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. జులై 24న ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. జులై 24న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్ లతో పాటు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల చేయనున్నారు. అలాగే వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు కూడా విడుదల చేయనున్నారు. జులై 25న 300 రుపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు టీటీడీ విడుదల చేయనుంది. అలాగే.. ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించి రోజుకి 4 వేల చొప్పున అదనపు కోటా టికెట్లు విడుదల చేయనున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
తిరుమల, తిరుపతి, తలకోనలో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 26న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే.. శ్రీవాణి ట్రస్టు దాతల కోసం… శ్రీవాణి ట్రస్టు దాతలకు దర్శనం, గదులకు సంబంధించి అక్టోబరు కోటాను జూలై 24న ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.