
తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్ కాకమాను, విష్ణు ప్రధాన పాత్రలో అనిల్ రెడ్డి దర్శకత్వం వహించిన న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘తులసీవనం’. ఈటీవీ విన్ ఓటీటీలో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. అందరూ ఎంజాయ్ చేసేలా ‘తులసీవనం’ ఉంటుందని తరుణ్ భాస్కర్ చెప్పాడు. అందరూ రిలేట్ చేసుకునే కంటెంట్ ఇది అన్నాడు అక్షయ్. డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ ‘ఇదొక క్యూట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. స్మరన్ మ్యూజిక్తో వేరే లెవల్కి తీసుకెళ్ళారు’ అని చెప్పాడు. నితిన్ చక్రవర్తి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.