కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ని తీసుకొచ్చిన ట్విట్టర్

కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ని తీసుకొచ్చిన ట్విట్టర్

ట్విట్టర్ విషయంలో ఎలన్ మస్క్ మరొక కొత్త మార్పు తీసుకురాబోతున్నారు. ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ పేరుతో కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తీసుకురాబోతున్నారు. ఈ ప్లాన్ కి సంబంధించిన వివరాల్ని ప్రకటిస్తూ, సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవాళ్లు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు పొందొచ్చని వివరించారు. ఇప్పటికే పలు దేశాల్లో అమలైన ఈ సబ్ స్క్రిప్షన్ ప్లాన్, ఇప్పుడు భారత్ కి తీసుకురాబోతున్నారు.

ఈ ప్లాన్ ద్వారా సబ్ స్క్రైబర్లు ఏదైనా ట్వీట్ చేస్తే వాళ్ల ట్వీట్ ఫస్ట్ ప్రయారిటీలోకి వెళ్తుంది. అంటే అన్ని ట్వీట్లకన్నా సబ్ స్క్రైబర్ చేసిన ట్వీట్ ముందు వరుసలో కనిపిస్తుంటుంది. ఈ ప్లాన్ తీసుకున్నవాళ్లకు యాడ్స్ కూడా రావు. అంతేకాదు పొరపాటున చేసిన ట్వీట్లను అన్ డూ కూడా చేయొచ్చు. అయితే, ఈ ప్లాన్ ధర నెలకు రూ.899 నుంచి ప్రారంభం అవుతుంది.