గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్లోని అగ్రి వర్సిటీ వద్ద డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి150 గ్రామాల ఎండీఎం స్వాధీనం చేసుకున్నారు. వర్సిటీ ప్రధాన ద్వారం ముందున్న హైవే సర్వీస్ రోడ్డు గుండా గుర్తుతెలియని వ్యక్తులు నిషేధిత మత్తు పదార్థాలను తరలిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మాటు వేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో అటుగా వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 150 గ్రామాలు ఎండీఎంను పోలీసులు గుర్తించారు. దాంతో ఎండీఎం రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్చేశారు.
