దారి దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు

దారి దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు

గండిపేట, వెలుగు:  ఆటోలో ఓ వ్యక్తిని ఎక్కించుకుని దారి దోపిడీకి పాల్పడిన ఇద్దరిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. కొత్వాల్‌‌‌‌గూడకు చెందిన రాజు కోకాపేట్‌‌‌‌లో లారీ డ్రైవర్‌‌‌‌గా చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఓనర్ వద్ద రూ. 5,500 తీసుకుని తన ఫోన్‌‌‌‌ పౌచ్ లో పెట్టుకుని ఇంటికి వెళ్లేందుకు నార్సింగిలో ఉన్నాడు. రాజును హఫీజ్‌‌‌‌పేట్‌‌‌‌కు చెందిన సయ్యద్‌‌‌‌ ఫారూక్, సయ్యద్‌‌‌‌ మస్తాన్‌‌‌‌ ఆటోలో ఎక్కించుకున్నారు. 

కొంత దూరం వెళ్లాక అతడిని కొట్టి, ఫోన్ పౌచ్ లోని నగదును లాక్కుని కిందకు తోసేసి పారిపోయారు.  దీంతో బాధితుడు రాజు కంప్లయింట్ తో  ఏసీపీ జి.వి.రమణగౌడ్‌‌‌‌ ఆధ్వర్యంలో నార్సింగి ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ జి.హరికృష్ణరెడ్డి, డిటెక్టివ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ ఎ.శ్రీనివాస్, క్రైమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ నిందితులు ఫారూక్, మస్తాన్ లను అదుపులోకి తీసుకుని ఆటోను స్వాధీనం చేసుకున్నారు.