
రియో డి జెనీరో: బ్రెజిల్లో ఇద్దరు గవర్నర్లకు కరోనా పాజిటిల్ కన్ఫామ్ అయింది. రియో డి జనీరో రాష్ట్ర గవర్నర్ విల్సన్ విట్జెల్, ఉత్తర రాష్ట్రమైన పారాకు చెందిన హెల్డర్ ఇద్దరూ తమకు కరోనా వచ్చినట్లు ప్రకటిస్తూ వీడియోలను ట్విట్టర్లో బుధవారం పోస్ట్ చేశారు. జ్వరం, గొంతు నొప్పితో స్మెల్ చూసే సెన్స్ కోల్పోయానని, శాంపిల్స్ టెస్ట్ కి పంపించగా రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని విల్సన్ చెప్పారు. ‘‘దేవుడి దయ వలన ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. డాక్టర్ల సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉంటున్నా. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండండి” అని విజ్ఞప్తి చేశారు. ‘‘వైరస్ త్వరగా వ్యాపిస్తుంది. వయసు, జెండర్ తో సంబంధం లేకుండా అందరిపై ఎటాక్చేస్తుంది. అందరూ ఇంట్లోనే ఉండాలి. డిస్టెన్స్ మెయింటేన్ చేయాలని కోరుతున్నా”అని హెల్డర్ పోస్టు చేశారు.