దిల్​సుఖ్​నగర్ డిపోలో రెండు బస్సులు దగ్ధం

దిల్​సుఖ్​నగర్ డిపోలో రెండు బస్సులు దగ్ధం

ఎల్​బీనగర్,వెలుగు :  దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సుఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ ఆర్టీసీ బస్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. సోమవారం తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకు డిపో  నుంచి చౌటుప్పల్ వెళ్లే ఆర్డినరీ బస్సు బయలుదేరేందుకు సిద్ధమైంది. డ్యూటీ డ్రైవర్ వచ్చి బస్సు ఇంజన్ స్టార్ట్ చేసి కిందకు దిగాడు. తన పని ముగించుకుని డ్రైవర్ బస్సును బయటకు తీసేందుకు సిద్ధమయ్యాడు. బస్సు ఇంజిన్ నుంచి ఏదో కారుతున్నట్లు చెకింగ్ సిబ్బంది చూసి డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అలర్ట్ చేశారు. ఇరువురూ వచ్చి చూసేసరికి బస్సు కింది భాగంలో పొగ మంటలు వస్తున్నాయి

దీంతో వారు వెంటనే పక్కన ఉన్న ఇసుకను తెచ్చి ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అధికారులకు తెలిపారు. ఫైర్ ఇంజన్ వచ్చే లోపు రెండు బస్సులతో పాటు పక్కనే ఉన్న మరో గూడ్స్ బస్సుకు సైతం మంటలు వ్యాపించాయి.ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణాలను షార్ట్ సర్క్యూట్ గా ప్రాథమిక అంచనా వేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.