ఆ పిల్లలకు దిక్కెవరు? 

ఆ పిల్లలకు దిక్కెవరు? 

సుల్తానాబాద్, వెలుగు: ప్రేమ పెళ్లి చేసుకున్న ఇరువురి జీవితం విషాదాంతం అయింది. నాడు తల్లి, ఇప్పుడు తండ్రి ఆత్మహత్యకు పాల్పడడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. వీరు చేసిన ఆర్తనాదాలతో గ్రామం కన్నీటి పర్యంతమైంది. ఈ హృదయ విచారక సంఘటన సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో శనివారం జరిగింది. కొదురుపాక గ్రామానికి చెందిన మద్దెల విజయ్, సవిత  12 ఏండ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సాయి వర్షిత్(11), సిరివర్షిణి (7) ఉన్నారు. మూడేళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులతో సవిత(26) ఆత్మహత్య చేసుకుంది. దీంతో విజయ్(35) ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన క్యాన్సర్ బారిన పడ్డాడు. ఓ భార్య లేదన్న బాధ, మరోవైపు క్యాన్సర్ రావడంతో కొంతకాలంగా కుమిలిపోతున్నాడు. మనస్తాపానికి గురై శుక్రవారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఉరి వేసుకొని సూసైడ్​ చేసుకున్నాడు. విజయ్​కు తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో ఇద్దరు చిన్నారులు దిక్కు లేని వారయ్యారు.