ఎక్స్ పైరీ డేట్ అయిన బిస్కెట్లు తిని ఇద్దరు పిల్లలకు అస్వస్థత

ఎక్స్ పైరీ డేట్ అయిన బిస్కెట్లు తిని ఇద్దరు పిల్లలకు అస్వస్థత

హైదరాబాద్: పతంజలి బ్రాండ్ బిస్కెట్లు తిని ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురైన ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడలో జరిగింది. వివరాలు.. ఓం రెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు కొడుకులకు తినడానికి బిస్కిట్ ప్యాకెట్ లు తీసుకోవడానికి హైదర్ గూడలోని పతంజలి ఆరోగ్య కేంద్రం స్టోర్ కు వెళ్లాడు. అక్కడ బిస్కెట్లు తీసుకొని వచ్చి తన పిల్లలకు తినిపించాడు. వాటిని తిన్నాక పిల్లలకు వాంతులవడంతో హాస్పిటల్ కు తీసువెళ్లి చికిత్స చేయించాడు. తర్వాత ఆ బిస్కెట్ ప్యాకెట్ ను గమనించి చూడగా దాని ఎక్సపైరీ డేట్ అయిపోయింది. దీంతో ఈ విషయం గురించి షాప్ కు వెళ్లి ఓనర్ ను నిలదీయగా.. తనతో దురుసుగా ప్రవర్తిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడని ఓం రెడ్డి చెప్పాడు. తన కొడుకు అనారోగ్యానికి గురవ్వడానికి కారణమైన పతంజలి బిస్కెట్స్ ను అమ్మిన షాప్ ఎదుట అతడు ధర్నాకు దిగాడు. అనంతరం రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ బిస్కెట్ బాక్స్ ను జప్తు చేసి షాప్ యజమానిని స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.