వినాయక విగ్రహం తరలిస్తుండగా కరెంట్ షాక్..ఇద్దరు మృతి..ఏడుగురి పరిస్థితి విషమం

వినాయక విగ్రహం తరలిస్తుండగా కరెంట్ షాక్..ఇద్దరు మృతి..ఏడుగురి పరిస్థితి విషమం

జగిత్యాల జిల్లా  కోరుట్ల పట్టణంలో విషాదం చోటుచేసుకుంది.  వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి చెందగా..మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..పట్టణంలోని వినాయక విగ్రహ తయారీ కేంద్రంలో  తయారు చేసిన గణపతి విగ్రహాలను ఒక చోట నుంచి  మరో చోటకు  తరలిస్తున్న సమయంలో వీధిలో  పైన ఉన్న 33 kv వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే వైర్లను కర్ర సాయంతో  పైకి లేపారు. ఈ ఘటనలో గాయపడ్డ తొమ్మిది మందిలో ఆస్పత్రికి తరలించే లోపే ఇద్దరు మృతి చెందారు. మరో  ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు  బాలాజీ కళా ఆర్ట్స్ వినాయక తయారీ ఓనర్ అల్వాల వినోద్ తో  పాటు మరో వర్కర్ నెలూట్ల బంటిగా గుర్తించారు.  గాయపడిన వారిలో  ఇద్దరు మహారాష్ట్ర, ఇద్దరు యూపీ వాసులు ఉన్నారు.  

కరెంట్ షాక్ కు గురైన తొమ్మిది మంది


1) అల్వాల వినోద్(కోరుట్ల)మృతి
2) అల్వాల నితిన్(కోరుట్ల) 
 3)వెంకట్ రెడ్డి(కోరుట్ల) 
4) నెల్లుట్ల బంటి(అర్బన్ కాలనీ కోరుట్ల) మృతి
5) నెల్లుట్ల కృష్ణ (అర్బన్ కాలనీ కోరుట్ల)
6)సాయినాథ్(మహారాష్ట్ర) 
7)హనుమంతు(మహారాష్ట్ర) 
8) ఆకాష్( యూపీ)
 9) రోషన్ (యూపీ)