బీరు బాటిళ్లతో పోలీసులపై దాడి చేసిన మందుబాబులు

బీరు బాటిళ్లతో  పోలీసులపై దాడి చేసిన మందుబాబులు

సిద్దిపేట జిల్లా కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయారు. పోలీస్ పై బీర్ బాటిళ్లతో దాడి చేశారు. కోహెడ పాతబస్టాండ్ సమీపంలో గొడవ జరుగుతోందని రాత్రి డయల్ 100కు కాల్ వచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్స్ మెహన్, లక్ష్మణ్ లు గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో గొడవకు కారణమైన నజీమోద్దీన్ కానిస్టేబుల్స్ పై దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ మోహన్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో మోహన్ ను చికిత్స కోసం కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించారంటూ  కేసు నమోదు చేసిన పోలీసులు...దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. నజీమోద్దిన్ కోసం కోసం గాలిస్తున్నారు పోలీసులు.