గుఫానగర్‌‌లో ఇద్దరు విద్యార్థినులు మిస్సింగ్

గుఫానగర్‌‌లో ఇద్దరు విద్యార్థినులు మిస్సింగ్
  • మంగళ్ హట్ పీఎస్ పరిధిలో ఘటనలు

మెహిదీపట్నం, వెలుగు : వేర్వేరు ప్రాంతాల్లో ఇంట్లోంచి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటనలు  మంగళ్ హట్ పీఎస్ పరిధిలో జరిగాయి. పోలీసులు తెలిపిన ప్రకారం.. మంగళ్ హట్ గుఫానగర్ ప్రాంతానికి చెందిన మల్లేశ్ కూతురు కల్యాణి (20) డిగ్రీ చదువుతోంది. 

మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. మరో ఘటనలో.. శివ్ లాల్ నగర్ కు చెందిన రాజేందర్ కూతురు వర్షిత (17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఈనెల 2న ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. విద్యార్థినుల కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు కంప్లయింట్లు చేయగా మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.