భూ వివాదంతో కర్రలతో కొట్టుకున్నరు

భూ వివాదంతో కర్రలతో కొట్టుకున్నరు
  •     పాలమూరు జిల్లా భూరెడ్డిపల్లి పరిధిలో  ఫైటింగ్​
  •     ఇద్దరికి గాయాలు,   సోషల్​ మీడియాలో వీడియో వైరల్​

జడ్చర్ల టౌన్​, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలంలో భూ వివాదంతో రెండు వర్గాల మధ్య గొడవ జరగ్గా..కర్రలతో కొట్టుకున్నారు. భూరెడ్డిపల్లి పరిధిలోని నేషనల్ ​హైవే పక్కన ఉన్న ఓ వ్యవసాయ భూమిలో 23 గుంటల భూమిని మహబూబ్​నగర్​కు చెందిన కొందరు కొనుగోలు చేశారు. బుధవారం హద్దురాళ్లు ఏర్పాటు చేసుకుంటుండగా, వారు కొన్న స్థలంలో కాకుండా తమ భూమిలోంచి పాతుతున్నారని గ్రామానికి చెందిన వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. 

ఇది ముదరడంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. కొంతమంది పోలీసులకు ఫోన్​ చేసి చెప్పగా వారు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. దాడిలో మాజీ సర్పంచ్​ సత్తయ్య, చింటుతో పాటు మరికొందరు గాయపడగా దవాఖానకు తరలించారు. జడ్చర్ల టౌన్ ఎస్సె చంద్రమోహన్ రావు మాట్లాడుతూ ఫిర్యాదు వచ్చిందని, పరిశీలించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఈ దాడులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.