భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. చర్ల – ఛత్తీస్ ఘడ్ సరిహద్దు అడవుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకోగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ ప్రాంతానికి తరలి వెళ్లిన కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ అక్కడ పరిశీలిస్తున్నారు. ఆదివారం రాత్రి చర్ల మండలంలోని పెదముసిలేరు గ్రామ శివారులో గల పైడి వాగు వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చివేశారు. మందు పాతర పేల్చిన గంటల వ్యవధిలోనే పోలీసుల ఎన్ కౌంటర్ జరగడంతో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుండాల మండలంలో ఈనెల 3న మావోయిస్టు సభ్యుడు దూది దేవాల్‌ అలియాస్‌ శంకర్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఎన్‌కౌంట‌ర్‌తో మ‌న్యం ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.