- చార్మినార్ చూసేందుకు వచ్చామన్న ఛత్తీస్గఢ్ మైనర్లు
- పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించిన రైల్వే పోలీసులు
సికింద్రాబాద్, వెలుగు: రెండు నెలల కింద ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన పరిచయంతో ముగ్గురు మైనర్లు చార్మినార్ చూడాలని ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ కు వచ్చారు. సికింద్రాబాద్రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా రైల్వే పోలీసులు పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్కు చెందిన కిరణ్సింఘా(16), శివమ్మిశ్రా(17), హెన్పుష్పా పటేల్(15) వేర్వేరు స్కూళ్లలో పది, తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వీరి ముగ్గురికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఎగ్జామ్స్అయిపోగానే చార్మినార్చూడాలని ప్లాన్చేసుకున్నారు. ఇంట్లో చెప్పకుండా ఈ నెల 28న రాయ్పూర్లో కోర్బా- – యశ్వంత్ పూర్ ట్రైన్ఎక్కి, శుక్రవారం ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగారు. చార్మినార్ఎలా వెళ్లాలి అని స్టేషన్లో ఎంక్వైరీ చేస్తుండగా, పోలీసులు గమనించారు. అనుమానంతో ముగ్గురిని విచారించగా తాము చార్మినార్చూసేందుకు ఛత్తీస్గఢ్నుంచి వచ్చినట్లు తెలిపారు. పోలీసులు వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా గురువారం నుంచి ముగ్గురు పిల్లలకు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు స్థానిక పటేవా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.