వనస్థలిపురం,ఆదిబట్లలో గంటలోనే రెండు స్నాచింగ్ లు

వనస్థలిపురం,ఆదిబట్లలో గంటలోనే రెండు స్నాచింగ్ లు

ఎల్​బీనగర్,వెలుగు: సిటీ శివారులో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఆదివారం గంట వ్యవధిలోనే రెండు ప్రాంతాల్లో మహిళల బంగారు చైన్లను లాక్కెళ్లారు. వనస్థలిపురం పరిధి సచివాలయ నగర్ లో ఉండే మంగిశెట్టి భాగ్యలక్ష్మి(40)  ఇంట్లో నిద్రిస్తుండగా కిటికీ వద్దకు వచ్చిన దొంగ ఆమె మెడలోని 3.5 తులాల గోల్డ్ చైన్ ఎత్తుకెళ్లాడు.

ఆదిబట్ల పరిధి రాగన్నగూడ సూరజ్ నగర్ కాలనీలో ఓ మహిళ ఇంట్లో విద్యుత్ మీటర్ వస్తుందా అంటూ ఓ దుండగుడు వచ్చి అడిగి మీటర్ వైర్ కట్ చేశాడు. అనంతరం మహిళ మెడలోంచి 4 తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు. బాధిత మహిళల కంప్లయింట్లతో వనస్థలిపురం, ఆదిబట్ల పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.