గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం జీడీకే 11వ గనిలో ఇద్దరు కార్మికులకు కరెంట్ షాక్ కొట్టింది. శనివారం తెల్లవారుజామున గనిలోని 3వ సీమ్ సౌత్ డిస్ట్రిక్ట్లోని 12డీ/54ఎల్ఎస్ ప్రాంతంలో ఆకుల సురేశ్, వి.అశ్వంత్ కుమార్ కోల్కట్టర్ డ్రిల్లింగ్ పనులు చేస్తున్నారు. ఎల్హెచ్డీ వెహికల్ డ్రిల్లింగ్ మిషన్కు సంబంధించిన కేబుల్ను లాగడంతో షార్ట్ సర్క్యూట్కు గురై ఈ ఇద్దరు కార్మికులకు షాక్కు కొట్టింది.
తీవ్రంగా గాయపడిన వారిని.. ఇతర కార్మికులు సింగరేణి ఏరియా హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. కాగా ఈ ప్రమాదం మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆరెల్లి పోచం, సీఐటీయూ జనరల్ సెక్రటరీ టి.రాజారెడ్డి, ఆరెల్లి రాజమౌళి ఆరోపించారు.
